కరోనా వ్యాక్సినేషన్‌కు సహకరించండి

ABN , First Publish Date - 2021-04-23T05:24:27+05:30 IST

గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకునేలా సహకారం అందించాలని స్థానిక ఎంపీడీవో ఎస్డీ శ్యాంసుందర్‌ కోరారు.

కరోనా వ్యాక్సినేషన్‌కు సహకరించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో శ్యాంసుందర్‌

చోడవరం ఎంపీడీవో శ్యాంసుందర్‌

చోడవరం, ఏప్రిల్‌ 22:
గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకునేలా సహకారం అందించాలని స్థానిక ఎంపీడీవో ఎస్డీ శ్యాంసుందర్‌ కోరారు. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం సర్పంచ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ టీకాలపై ప్రజల్లో అపోహలను తొలగించాలన్నారు. అలాగే కరోనా నిబంధనలను అందరికీ వివరించాలని కోరారు. ఈవోపీఆర్‌డీ చైతన్య పాల్గొన్నారు.

స్వీయ క్రమశిక్షణతోనే కరోనా అదుపు
బుచ్చెయ్యపేట:
స్వీయ క్రమశిక్షణతోనే కరోనాను అదుపు చేయగలమని తహసీల్దార్‌ మహేశ్వరరావు చెప్పారు. గురువారం సర్పంచ్‌ల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి ప్రజలు బయటకు రాకుండా చూడాలన్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వలంటీర్ల ద్వారా కరోనాపై ప్రజలను ఎప్పటికప్పడు అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ నారాయణరావు, సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, వెలుగు ఏపీఎం కనకమ్మ, ఎంఈవో అచ్యుతరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:24:27+05:30 IST