మజ్లిస్ విజ్ఞప్తికి టీఆర్ఎస్ ఓకే
ABN , First Publish Date - 2021-04-19T06:29:46+05:30 IST
జల్పల్లి మున్సిపాలిటీ
పహాడిషరీఫ్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): జల్పల్లి మున్సిపాలిటీ ఉప ఎన్నికల్లో కౌన్సిలర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలన్న మజ్లిస్ విజ్ఞప్తికి టీఆర్ఎస్ అంగీకరించింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధికారి పార్టీ నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామన్నారు. 28వ వార్డులో పోటీ చేసి గెలుపొందిన నాజియా బేగం మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, జల్పల్లి మున్సిపాలిటీ మజ్లిస్ ఇన్చార్జి అహ్మద్ సాది, చైర్మన్ అబ్దుల్లా సాది, పార్టీ ప్రతినిధులు ఆదివారం ఆర్కే.పురంలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయానికి వెళ్లి ఉప ఎన్నికల్లో నాజియా బేగం కోడలు తహసీన్ బేగంకు మద్దతు ఇవ్వాలని కోరారు.