‘విమర్శించే వారిపై చట్టపరమైన చర్యలు’
ABN , First Publish Date - 2021-07-27T06:27:54+05:30 IST
‘టీడీపీ ఎవరి ఆస్తి కాదు, ఎవరి సొత్తూ కాదు.. ప్రజల పార్టీ అని ఆ పార్టీ సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి తాడి సత్యనారాయణ అన్నారు.
అంతర్వేది, జూలై 26: ‘టీడీపీ ఎవరి ఆస్తి కాదు, ఎవరి సొత్తూ కాదు.. ప్రజల పార్టీ అని ఆ పార్టీ సఖినేటిపల్లి మండల ప్రధాన కార్యదర్శి తాడి సత్యనారాయణ అన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ పటిష్టతను దెబ్బతీసి ఓటమికి కారకుడైన పులగం రమేష్ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం పార్టీలో పనిచేస్తున్న నాయ కులపై విమర్శలు మానుకుని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో ముందుకు వెళ్లాలని... లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశామని తెలిపారు. అమలాపురం నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు పొద్దోకు నారాయణరావు మాట్లాడుతూ గొల్లపల్లి సూర్యారావుపై రాజోలు నియోజకవర్గ కార్యకర్తలు పత్రికా ముఖంగా విమర్శించడాన్ని తప్పుపట్టారు. అయినవిల్లి ఏడుకొండలు, నామన రామకృష్ణ, అయినవిల్లి చినసత్యనా రాయణ, ఇంజేటి రత్నరాజు, పొన్నమండ కనకరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.