నేడు ఆత్మకూరులో ఉప ఎన్నికకు పోలింగ్
ABN , First Publish Date - 2022-06-23T12:24:47+05:30 IST
నేడు ఆత్మకూరు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. మాజీ మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక
నెల్లూరు: నేడు (గురువారం) ఆత్మకూరు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. మాజీ మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక జరుగుతుంది. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉపఎన్నికను అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్కాస్టింగ్ లైవ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది, 1100 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.