పర్యావరణ ఇంజనీరుగా నాగిరెడ్డి
ABN , First Publish Date - 2020-12-04T04:53:36+05:30 IST
జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరుగా జీ నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 3 : జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరుగా జీ నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇంజనీరుగా ఉన్న ప్రమోద్కుమార్ రెడ్డిని గత నెల 16వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను విశాఖపట్నంలో బాధ్యతలు తీసుకోవలసిందిగా ఆదేశిస్తూ గతనెల 30న పర్యావరణ నియంత్రణ మండలి ఉత్తర్వులిచ్చింది. దీంతో ప్రమోద్కుమార్రెడ్డి విశాఖకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఒంగోలు కాలుష్య నియంత్ర మండలి ప్రాంతీయ కార్యాలయంలో పనిచేస్తున్న జీ నాగిరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.