కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నాం: విశ్వరూప్
ABN , First Publish Date - 2022-04-23T02:12:52+05:30 IST
రాష్ట్రంలో నూతనంగా కాలుష్య రహిత ఎలక్ర్టిక్ బస్సులను తీసుకువస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
మామిడికుదురు: రాష్ట్రంలో నూతనంగా కాలుష్య రహిత ఎలక్ర్టిక్ బస్సులను తీసుకువస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. శుక్రవారం కోనసీమ జిల్లా మామిడికుదురులో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలెట్ ప్రాజెక్టుగా వంద ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం దశల వారీగా విశాఖపట్నం, విజయవాడ, రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య నడపడానికి కృషి చేస్తామన్నారు. రవాణా వ్యవస్థను పటిష్ట చేస్తామని విశ్వరూప్ తెలిపారు.