నేడు పాలిసెట్‌

ABN , First Publish Date - 2022-05-29T05:49:41+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆదివారం పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో 29, టెక్కలిలో 15 కేంద్రాల్లో.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులను గంట ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించరు.

నేడు పాలిసెట్‌
ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా పరిశీలకులు డాక్టర్‌ ఎంఏవీ రామకృష్ణ

- 44 కేంద్రాల్లో నిర్వహణ
- ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
ఎచ్చెర్ల, మే 28:
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు  సంబంధించి ఆదివారం పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో 29, టెక్కలిలో 15 కేంద్రాల్లో.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులను గంట ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించరు. జిల్లా ప్రత్యేక పరిశీలకుడిగా కమిషనర్‌ కార్యాలయపు ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి ఎంఏవీ రామకృష్ణ, ప్రత్యేక పరిశీలకుడిగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌(విశాఖపట్నం) కెమికల్‌ విభాగాధిపతి బి.లక్ష్మణరావును నియమించారు. శ్రీకాకుళంలోని పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (శ్రీకాకుళం) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జి.దామోదరరావు, టెక్కలిలోని కేంద్రాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (ఆమదాలవలస) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పి.శ్రీనివాస్‌ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. జిల్లాలో 7,200 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల్లోకి మొబైల్స్‌, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించరు. విద్యార్థులు బాల్‌పెన్ను, పెన్సిల్‌, రబ్బరును తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.

Updated Date - 2022-05-29T05:49:41+05:30 IST