చెరువు శిఖం భూములను పేదలకు పంచాలి
ABN , First Publish Date - 2022-07-01T06:39:31+05:30 IST
హాలియా మునిసిపాలిటీ పరిధిలోని అధికార పార్టీ నేతలచే కబ్జాకు గురైన చెరువు శిఖం భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్ డిమాండ్ చేశారు.
నల్లగొండ టౌన, జూన 30 : హాలియా మునిసిపాలిటీ పరిధిలోని అధికార పార్టీ నేతలచే కబ్జాకు గురైన చెరువు శిఖం భూములను భూమి లేని నిరుపేదలకు పంచాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపేట గ్రామ శివారులో సర్వే నెంబరు 16, 17, 68, 72లో గల 32 ఎకరాల భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూమి తక్షణమే పరిరక్షించి స్థానిక నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. కబ్జా పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఇనచార్జి ఊదరి సైదులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్ర నిర్మల, కోడి భీంప్రసాద్, కత్తుల కాన్షీరాం, ఆదిమళ్ల వెంకటేశ్వర్లు, ఒంటెపాక యాదగిరి, అంకపాక కోటేష్, పోకల ఎలిజిబెత, రుద్రాక్షి యాదయ్య, పందిరి సైదులు తదితరులు పాల్గొన్నారు.