TS News: రాజగోపాల్ రెడ్డిపై సెటైర్లు వేసిన పొన్నాల

ABN , First Publish Date - 2022-07-26T18:36:29+05:30 IST

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సెటైర్లు వేశారు.

TS News: రాజగోపాల్ రెడ్డిపై సెటైర్లు వేసిన పొన్నాల

హైదరాబాద్ (Hyderabad): పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) సెటైర్లు వేశారు. మంగళవారం గాంధీ భవన్‌ (Gandhi Bhavan)లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్ష (Satyagraha Initiation)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈడీ (Enforcement Directorate) పిలిస్తే వెళ్ళాలని కొందరు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (M Modi)ది నీచ చరిత్ర అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ (BJP)లో కలుపుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. రాహుల్ (Rahul), సోనియా గాంధీ (Sonia Gandhi)లపై ఈడీ విచారణ కుట్ర పూరితమేనని అన్నారు. మోదీ దుబారా ఖర్చులపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు ఎందుకు కళ్లు మూసుకుంటున్నాయని ప్రశ్నించారు. ‘మోదీ... నీ మేకిన్ ఇండియా’ ఎక్కడికి పోయిందని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

Updated Date - 2022-07-26T18:36:29+05:30 IST