చోళ రాజధానిలో పొన్నియిన్ టీజర్
ABN , First Publish Date - 2022-06-19T08:04:34+05:30 IST
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబరు 30న విడుదలవుతోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. జులై 07న ఈ చిత్రం టీజర్ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలె ప్రకటించింది. ఇది చారిత్రక కాల్పనిక గాథతో తెరకెక్కుతున్న చిత్రం. చరిత్రలో చోళ రాజులు రాజధానిగా చేసుకున్న తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ఈ చిత్రం టీజర్ను ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను భారీఎత్తున నిర్వహించనున్నారు.