తెలంగాణ రైతు కుటుంబాలకూ పరిహారం ఇవ్వాలి: పొన్నాల
ABN , First Publish Date - 2022-05-26T10:02:45+05:30 IST
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): నల్ల చట్టాలపై నిరసనలో చనిపోయిన పంజాబ్ రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రైతుల
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): నల్ల చట్టాలపై నిరసనలో చనిపోయిన పంజాబ్ రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రైతుల కుటుంబాలకూ ఇవ్వాలని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నియంతృత్వ విధానాలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. గాంధీభవన్లో బుధవారం మీడియా సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ గత నెల రోజులుగా రైతులు ధాన్యం సేకరణ కేంద్రాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల వడ్లలో 11 శాతం మేరకు మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అడ్డగోలు కొనుగోళ్లపై సమీక్ష చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు.