పెద్దింటి అమ్మాయితో సహా ఇంట్లోంచి పారిపోయిన కూలీవాడు.. వారిని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-04-07T09:01:55+05:30 IST

ఒక యువకుడిని ప్రేమించి, అతనితో పారిపోయిందా యువతి. ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆ జంట ఎక్కడకు వెళ్లింది? ఎవరికీ తెలియలేదు..

పెద్దింటి అమ్మాయితో సహా ఇంట్లోంచి పారిపోయిన కూలీవాడు.. వారిని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారంటే..

ఒక యువకుడిని ప్రేమించి, అతనితో పారిపోయిందా యువతి. ఆమె కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆ జంట ఎక్కడకు వెళ్లింది? ఎవరికీ తెలియలేదు. అయితే చివరకు పోలీసులు ఎలాగోలా ఆ యువతిని పట్టుకున్నారు. ఈ ఘటన బిహార్‌లో వెలుగు చూసింది. బిహార్‌కు చెందిన గుడ్డూ శ్రీవాస్తవ అనే యువకుడు.. రోజు కూలీ చేస్తూ బతికేవాడు. 

తన అన్న ఢిల్లీలో ఉండటంతో.. పనికోసమని అతని ఇంటికి వచ్చాడు. అక్కడే పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అన్న వాళ్ల ఇంటికి దగ్గరలో ఉన్న ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఫోన్‌లో రోజూ గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లు. జీవితాంతం కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు. అమ్మాయి కుటుంబం దీనికి ఒప్పుకోదని తెలిసి అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయారు. 


అమ్మాయి కుటుంబం ఇచ్చిన కంప్లయింట్‌తో రంగంలోకి దిగిన పోలీసులు.. చివరకు బిహార్ చేరుకున్నారు. అక్కడ గుడ్డూ అన్నావదినలు ఒక ఆస్పత్రిలో ఉండగా వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. యువతికి అనారోగ్యంగా ఉండటంతో అదే ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని వాళ్లు చెప్పారు. అయితే పోలీసులు వచ్చినట్లు తెలుసుకున్న గుడ్డూ అక్కడి నుంచి పరారయ్యాడు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టు నుంచి ట్రాన్స్‌మిట్ అనుమతి తీసుకొని ఆమెను ఢిల్లీకి తరలించారు. అయితే తామిద్దరం ప్రేమించుకున్నామని, కలిసి ఉండేందుకు ఇష్టపడే ఇంటి నుంచి పారిపోయానని యువతి చెబుతోంది. అంతేకాదు, తామిద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పింది.


Updated Date - 2022-04-07T09:01:55+05:30 IST