పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-01-22T05:59:04+05:30 IST
పేదల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం జిల్లాలో పలుచోట్ల ఇళ్ల పట్టాలు పం పిణీ కార్యక్రమం జరిగింది.
- ఎంపీ వంగా గీత.. పలుచోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ
కోటనందూరు, జనవరి 21: పేదల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం జిల్లాలో పలుచోట్ల ఇళ్ల పట్టాలు పం పిణీ కార్యక్రమం జరిగింది. కోటనందూరు మండలం బొద్దవరంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ గీత పాల్గొని మాట్లాడారు. పేదల కళ్లలో ఆనందం నింప డమే లక్ష్యంగా సీఎం జగన పని చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తా మన్నారు. కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, బొంగు ఉమారావు, లగుడు శ్రీనివాస్, లంకప్రసాద్, దొడ్డిబాబ్జి, వి.రాజుబాబు పాల్గొన్నారు.