Rahulను మనవడు అని సంబోధించిన గద్దర్

ABN , First Publish Date - 2022-05-07T16:34:12+05:30 IST

తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకపోతానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.

Rahulను మనవడు అని సంబోధించిన గద్దర్

హైదరాబాద్: తెలంగాణలో నెలకొన్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకుపోతానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన గద్దర్...‘‘రాహుల్‌ను నా మనవడు’’ అంటూ సంబోధించారు. తెలంగాణ సాధించుకున్నాక కూడా ఎవరు సంతృప్తిగా లేరని తెలిపారు. తెలంగాణ వచ్చాక కూడా  ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రాలేదని అన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌ని స్వాగిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువతకు నాయకత్వం అప్పగించాలని సూచించారు. యువ నాయకత్వం ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలన్నారు. రాహుల్ యువతను నడిపించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మాదిరి దేశం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి రాహుల్ సిద్ధం కావాలని గద్దర్ పేర్కొన్నారు.

Read more