పోరస్లో విచారణ కమిటీ పరిశీలన
ABN , First Publish Date - 2022-05-26T05:57:17+05:30 IST
అక్కిరెడ్డిగూడెం పోరస్ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ బృందం సభ్యులు బుధవారం ప్రమాద బ్లాక్ను పరిశీలించారు.
ముసునూరు, మే 25: అక్కిరెడ్డిగూడెం పోరస్ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ బృందం సభ్యులు బుధవారం ప్రమాద బ్లాక్ను పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్, నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి, ఇండస్ట్రీస్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రమాదం జరిగిన బ్లాక్ను క్షుణంగా పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు. త్వరితగతిన విచారణ పూర్తిచేసి త్వరలోనే నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు విచారణ కమిటీ చెర్మన్, జేసీ అరుణ్ కుమార్ తెలిపారు. తహసీల్దార్ కెఎస్ జోజి, ఎంపీడీవో సత్యనారాయణ, కార్యదర్శి యోహాను, పోరస్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.