డబ్బులు ఇచ్చి మరీ దాడి చేయిస్తుంటే.. చిరంజీవి స్పందించరా: పోసాని

ABN , First Publish Date - 2021-09-30T22:47:28+05:30 IST

డబ్బులు ఇచ్చి మరీ దాడి చేయిస్తుంటే.. చిరంజీవి స్పందించరా: పోసాని

డబ్బులు ఇచ్చి మరీ దాడి చేయిస్తుంటే.. చిరంజీవి స్పందించరా: పోసాని

హైదరాబాద్: పవన్‌ ఊసరవెల్లి రాజకీయాలపై ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. డబ్బులు ఇచ్చి మరీ రాళ్ల దాడి చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అప్పుడు చిరంజీవి కుటుంబాన్ని తానే కాపాడానని.. ఇప్పుడు తమ్ముడు దాడులు చేయిస్తుంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదని పోసాని ప్రశ్నించారు.


కాగా అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. పోసానిని దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. 


ఏపీలో సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల వ్యవహారంపై జనసేన వర్సెస్ వైసీపీగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ పవన్‌పై పోసాని కృష్ణమురళి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసాని ప్రెస్‌మీట్‌ను అడ్డుకునేందుకు జనసేన తెలంగాణ కార్యకర్తలు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. తన ప్రాణానికి రక్షణ లేదని, తనపై దాడి జరిగే అవకాశం ఉందని, అందుకు పూర్తి బాధ్యతే పవన్‌దేనని పోసాని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2021-09-30T22:47:28+05:30 IST