వి.కోటలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్
ABN , First Publish Date - 2021-09-30T06:24:35+05:30 IST
వి.కోట బాలుర వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిణి పల్లవి తెలిపారు.
వి.కోట, సెప్టెంబరు 29: వి.కోట బాలుర వసతి గృహంలో ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారిణి పల్లవి తెలిపారు. మూడు రోజుల క్రితం పిల్లలకు జ్వరం, జలుబు ఉండటంతో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.ముగ్గురికి పాజిటివ్ రావడంతో ఉపాధ్యాయులు, వైద్యులు శానిటేషన్ పనులు చేపట్టారు. కొవిడ్ వచ్చిన పిల్లలను హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి కుటుంబసభ్యులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. బుధవారం వి.కోట బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొవిడ్పై అవగాహన కల్పించారు. బాలుర వసతి గృహంలో 20 మంది పిల్లలకు కొవిడ్ పరీక్షలు జరిపారు. కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.