హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌కు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-08T09:20:17+05:30 IST

భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారినపడినట్టు హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది.

హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌కు పాజిటివ్‌

న్యూఢిల్లీ: భారత కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారినపడినట్టు హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. మన్‌ప్రీత్‌, డిఫెండర్‌ సురేందర్‌ కుమార్‌, జస్కరణ్‌ సింగ్‌, డ్రాగ్‌ఫ్లికర్‌ వరుణ్‌ కుమార్‌లకు పాజిటివ్‌ వచ్చినట్టు వెల్లడించింది. నెల రోజుల విరామం అనంతరం బెం గళూరులోని జాతీయ శిబిరానికి వచ్చిన అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలారు.

Updated Date - 2020-08-08T09:20:17+05:30 IST