ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం

ABN , First Publish Date - 2022-08-09T06:26:04+05:30 IST

కాకరాపల్లి, పాటిపల్లి, తోటాడ, నారాయుడుపాలెం మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సోమవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.

ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం
పాటిపల్లి కేజీబీవీలో ఉపాధ్యాయుల నినాదాలు


మునగపాక, ఆగస్టు 8 : కాకరాపల్లి, పాటిపల్లి, తోటాడ, నారాయుడుపాలెం మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సోమవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి సన్యాసినాయుడు,  మండల అధ్యక్షుడు ఎంవై రాము ఆధ్వర్యంలో వారంతా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తమ సమస్యల పరిష్కారం కోసం పోస్టుకార్డులు రాసి పంపారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయరాదని, సీపీఎస్‌ రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-08-09T06:26:04+05:30 IST