పోస్టర్లు విడుదల చేశారు
ABN , First Publish Date - 2021-03-02T05:29:43+05:30 IST
నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు.
నంద్యాల టౌన్, మార్చి 1: నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ 400 మి.గ్రా మాత్రలను వాడాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు తప్పనిసరిగావేయాలని ఈ మాత్రలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో అంకిరెడ్డి, ఐసీడీఎస్ అధికారి లీలావతి, చంద్రకళ పలువురు పాల్గొన్నారు.