నీరజ్ మృతదేహానికి post mortem పూర్తి
ABN , First Publish Date - 2022-05-21T22:13:55+05:30 IST
కులోన్మాదులు కేసులో దారుణ హత్యకు గురయిన నీరజ్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి చేశారు. నీరజ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
హైదరాబాద్: కులోన్మాదులు కేసులో దారుణ హత్యకు గురయిన నీరజ్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి చేశారు. నీరజ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఉస్మానియా మార్చురీ నుంచి నీరజ్ మృతదేహాన్ని నివాసానికి తరలించారు. సాయంత్రం 6 గంటలకు ఎంజీబీఎస్ సమీపంలో నీరజ్ అంత్యక్రియలు నిర్వహిస్తారు. గతేడాది ఏప్రిల్లో సంజన, నీరజ్లు ఇంట్లోంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. నీరజ్పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని చూసిన సంజన కుటుంబసభ్యులు అదునుకోసం ఎదురు చూశారు. కొద్దిరోజులుగా నీరజ్ను హతమార్చాలని పథకం వేశారు. ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పక్క వీధిలో పల్లీల వ్యాపారం చేస్తున్న తన మామ వద్దకు శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నీరజ్ వెళ్లాడు. స్కూటీపై తిరిగి వస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైక్లపై వెంబడించారు. నీరజ్ తన ఇంటి సమీపంలోకి రాగానే.. అతడి స్కూటీని ఢీ కొట్టారు. దాంతో అతడు కింద పడిపోయాడు. వెంటనే బైక్లు దిగిన దుండగులు కత్తులతో నీరజ్పై దాడిచేశారు. 20సార్లు విచక్షణా రహితంగా పొడిచారు. తర్వాత రాడ్లతో కొట్టారు. చనిపోయాడో లేదోననే అనుమానంతో అక్కడే ఉన్న గ్రానైట్ రాయిని నీరజ్పై ఎత్తేశారు. అతడు మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత రెండు బైక్లపై పారిపోయారు.