పాతిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
ABN , First Publish Date - 2021-04-18T06:21:10+05:30 IST
ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన శోభాదేవి మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు.
హిందూపురం టౌన, ఏప్రిల్ 17: ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన శోభాదేవి మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, టూటౌన సీఐ మన్సూరుద్దీన సమక్షంలో పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గతనెల 21న శోభాదేవి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. అయితే మా అక్క మృతిపై అనుమానం ఉందని ఈనెల 10న శోభాదేవి చెల్లెలు స్వర్ణకుమారి టూటౌన పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఫిర్యాదు చేయగా పూడ్చిన శవాన్ని శనివారం బయటకు తీసి పోస్ట్మార్టం నిర్వహించారు. దీనిపై సీఐ మన్సూరుద్దీన మాట్లాడుతూ స్వర్ణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించామన్నారు. శవపరీక్ష నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు.