ఏపీలో మేయర్, చైర్మన్ల జాబితా ప్రకటన వాయిదా

ABN , First Publish Date - 2021-03-18T01:13:09+05:30 IST

మేయర్, చైర్మన్ల జాబితా ప్రకటన వాయిదా పడింది. జాబితాపై ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. గురువారం ఉదయం మేయర్, చైర్మన్ల జాబితా ప్రకటిస్తామని

ఏపీలో మేయర్, చైర్మన్ల జాబితా ప్రకటన వాయిదా

అమరావతి: మేయర్, చైర్మన్ల జాబితా ప్రకటన వాయిదా పడింది. జాబితాపై ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. గురువారం ఉదయం మేయర్, చైర్మన్ల జాబితా ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని సజ్జల పేర్కొన్నారు. మేయర్, చైర్మన్ల జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. బీసీలు, మైనార్టీలకు పెద్దపీట వేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతాల వారీగా సామాజిక సమీకరణలు, అభ్యర్థుల సమర్థత, స్థానికంగా పట్టు తదితర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఇంకా కసరత్తు చేస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉన్న చోట్ల సీఎం జగన్ స్వయంగా అభ్యర్థిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కర్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలను దాదాపుగా వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. 12  కార్పొరేషన్లకు గాను 11 కార్పొరేషన్లను, 75 మున్సిపాలిటీలకు దాదాపు 74 మున్సిపాలిటీలను వైసీసీ కైవసం చేసుకుంది. 

Updated Date - 2021-03-18T01:13:09+05:30 IST