అరోరా కాలేజీలో ‘జేఈఈ’ పరీక్ష వాయిదా

ABN , First Publish Date - 2022-06-25T02:44:13+05:30 IST

హైదరాబాద్‌: అబిడ్స్‌ అరోరా కాలేజీ సెంటర్‌లో జేఈఈ మెయిన్స్ మధ్యాహ్నం పరీక్ష వాయిదా పడింది. సర్వర్ ప్రాబ్లమ్‌తో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష

అరోరా కాలేజీలో ‘జేఈఈ’ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌: అబిడ్స్‌ అరోరా కాలేజీ సెంటర్‌లో జేఈఈ మెయిన్స్ మధ్యాహ్నం పరీక్ష వాయిదా పడింది. సర్వర్ ప్రాబ్లమ్‌తో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష నిర్వహణ తేదీని విద్యార్థులకు మెయిల్‌ చేస్తామని అరోరా కాలేజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ వెల్లడించారు. పూర్తి సమాచారం జాతీయ పరీక్షల సంస్థ (NTA)వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యార్థులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అరోరా కాలేజీలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష పదిన్నరకు ప్రారంభం కావడం గమనార్హం.

Updated Date - 2022-06-25T02:44:13+05:30 IST