రోజురోజుకు Janasenaకు జనాదరణ పెరుగుతోంది: Pothina Mahesh

ABN , First Publish Date - 2022-06-23T18:36:14+05:30 IST

రోజురోజుకు జనసేనకు జనాదరణ పెరుగుతోందని ఆ పార్టీ నేత పోతిన మహేష్ అన్నారు.

రోజురోజుకు Janasenaకు జనాదరణ పెరుగుతోంది: Pothina Mahesh

Vijayawada: రోజురోజుకు జనసేన (Janasena)కు జనాదరణ పెరుగుతోందని, అభిమానులు, కార్యకర్తలు పండుగలా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ నేత పోతిన మహేష్ (Pothina Mahesh) అన్నారు. గురువారం, 41 డివిజన్‌లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారని, భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు, ఉద్యోగాల అమ్మకాలను యధేచ్చగా సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గ అభివృద్దిని గాలికొదిలేశారని, ప్రజా సమస్యలను పట్టించుకోని ఆయన కేవలం వ్యక్తిగత అభివృద్దిపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. నాగబాబు అనే యువకుడు వెల్లంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే.. అరెస్టు చేయించారని, జనసేన నాగబాబుకు అండగా ఉండబట్టే ఆయనను పోలీసులు విడిచిపెట్టారని పోతిన మహేష్ అన్నారు. 

Updated Date - 2022-06-23T18:36:14+05:30 IST