గ్రేటర్లో విద్యుత్ బిల్లులు.. రూ.870 కోట్లు.. రికార్డ్
ABN , First Publish Date - 2022-05-31T11:43:54+05:30 IST
ఏప్రిల్ నెలలో గ్రేటర్లో (Greater Hyderabad) నమోదైన రికార్డుస్థాయి విద్యుత్
- మే 30 నాటికి 98 శాతం వసూళ్లు
హైదరాబాద్ సిటీ : ఏప్రిల్ నెలలో గ్రేటర్లో (Greater Hyderabad) నమోదైన రికార్డుస్థాయి విద్యుత్ వినియోగంతో (Power Bills) బిల్లులు కూడా భారీగా వసూలయ్యాయి. మే 30 నాటికి రూ. 870 కోట్ల బిల్లులను అధికారులు వసూలు చేశారు. గ్రేటర్ జోన్ తొమ్మిది సర్కిళ్ల పరిధిలో గృహ, కమర్షియల్ కేటగిరిలో మొత్తం విద్యుత్ బిల్లులు రూ. 884.12 కోట్లు. వాటిలో రూ.870 కోట్లు ఇప్పటికే వసూలయ్యాయి. బకాయిలు పేరుకుపోకుండా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలు లేకుండా సెక్షన్ల వారీగా జాగ్రత్త వహించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.