తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌

ABN , First Publish Date - 2021-01-17T05:49:13+05:30 IST

విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదని కోడుమూరు తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌ చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌

 కోడుమూరు(రూరల్‌), జనవరి 16: విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదని కోడుమూరు తహసీల్దార్‌ కార్యాలయానికి కరెంట్‌ కట్‌ చేశారు. దీంతో గత నాలుగు రోజులుగా కార్యాలయానికి విద్యుత్‌ సరఫరా లేదని తహసీల్దార్‌ ఉమామహేశ్వరమ్మ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ విద్యుత్‌ బకాయిలు రూ 1.87 లక్షలు ఉందన్నారు. బకాయిలు చెల్లించలేదని గత మంగళవారం సరఫరా నిలిపివేశారని తెలిపారు. అయితే పండుగ సెలవుల తర్వాత శనివారం కార్యాలయ విధులకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. బకాయిల విడుదలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించమని విద్యుత్‌ అధికారులకు విన్నవించగా, ఈఈను కలువమని ఏడీ సూచించారని తెలిపారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో కార్యకలాపాలను మీ సేవా, సచివాలయాల్లో చేసుకుంటున్నామని చెప్పారు.

Updated Date - 2021-01-17T05:49:13+05:30 IST