జనసేనతో కలిసి అధికారంలోకి వస్తాం: సునీల్‌ దేవ్‌ధర్‌

ABN , First Publish Date - 2022-04-13T21:16:47+05:30 IST

వైసీపీ పాలనలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేత సునీల్‌ దేవ్‌ధర్‌ తెలిపారు.

జనసేనతో కలిసి అధికారంలోకి వస్తాం: సునీల్‌ దేవ్‌ధర్‌

గుంటూరు: వైసీపీ పాలనలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేత సునీల్‌ దేవ్‌ధర్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెదకాకాని ఆలయ ప్రాంగణంలో మాంసాహారం ఘటనపై చర్యలేవని ప్రశ్నించారు. క్యాంటీన్‌ నిర్వాహకుడు షరీఫ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదన్నారు. తిరుమల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని విమర్శించారు. జగన్‌ ఓట్ల రాజకీయం చేస్తున్నారని, రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లిక్కర్‌, ఇసుక, ల్యాండ్‌ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీలను బుజ్జగించి హిందువులను కించపరుస్తారా? అని ప్రశ్నించారు. జిన్నాటవర్‌ విషయంలో మైనార్టీలను వెనకేసుకొచ్చారని సునీల్‌ దేవ్‌ధర్‌ తప్పుబట్టారు.

Updated Date - 2022-04-13T21:16:47+05:30 IST