నేడు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ABN , First Publish Date - 2021-04-17T05:35:51+05:30 IST
నేడు నగరంలో పలు ప్రాం తాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు నగర ఏడీఈలు అశోక్, తొట రాజశేఖర్ తెలిపారు.
సుభాష్నగర్, ఏప్రిల్ 16: నేడు నగరంలో పలు ప్రాం తాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు నగర ఏడీఈలు అశోక్, తొట రాజశేఖర్ తెలిపారు. నగరం లోని పవర్హౌజ్, తిలక్గార్డెన్, వినాయక్నగర్, బోర్గాం, దుబ్బ, సుభాష్నగర్, న్యూహౌజింగ్ బోర్డు, ముబారక్నగర్, గూపన్పల్లి, అర్సపల్లిలో విద్యుత్ సరఫరాలో అంత రాయం ఏర్పడుతుందన్నారు. నెలవారి మరమ్మతులో భా గంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.
భీమ్గల్లో..
భీమ్గల్: భీమ్గల్ మండల పరిధిలోని 33/11 కేవీ ఉప కేంద్రాల వద్ద మరమ్మతుల చేపడుతున్నామని ఏఈవో గయాస్ హైమద్ తెలిపారు. నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉప కేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరా యం ఉంటుందని పేర్కొన్నారు.
బాల్కొండలో..
బాల్కొండ: బాల్కొండ 33 కేవీ ఫిడర్ పరిధిలో విద్యు త్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఏఈ రాములు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12గంటల వరకు బాల్కొండ, బోదేపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. విని యోగదారులు సహకరించాలని ఆయన కోరారు.