నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN , First Publish Date - 2020-11-29T04:37:28+05:30 IST
కొమరాడ మండలం మాదలంగి ఫీడర్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఏపీ ట్రాన్స్కో డీఈఈ కె.వెంకట రత్నం చెప్పారు.
పార్వతీపురం :
కొమరాడ మండలం మాదలంగి ఫీడర్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని ఏపీ ట్రాన్స్కో డీఈఈ కె.వెంకట రత్నం చెప్పారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఫీడర్ నిర్వహణ పనులు చేపడుతున్నందున కొట్టు, మాదలంగి, చెక్కవలస, ఈదలవలస, కుంబి కోట, పాలెం, కర్లగండ, మర్రిగూడ, కుస్తూరు, గొందిలోవ, రావికోన, చోడిపల్లి, పూజారిగూడ గ్రామాల్లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.