TS news: బాసర ట్రిపుల్ ఐటీలో కరెంటు సమస్య
ABN , First Publish Date - 2022-08-09T17:31:40+05:30 IST
బాసర ట్రిపుల్ ఐటీలో కరెంటు సమస్య నెలకొంది.
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో కరెంటు సమస్య నెలకొంది. ట్రాన్స్ఫార్మర్స్ చెడిపోవడం, సోలార్ ప్లాంట్లు పని చేయకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక నిన్నటి నుంచి విద్యార్థులు, సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రిపుల్ ఐటీలో 10 జనరేటర్లు ఉన్నప్పటికీ అందులో ఒక జనరేటర్ మాత్రమే పనిచేస్తోంది. మరోవైపు నీరు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.