పీపీఈ కిట్లు, శానిటైజర్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-11T03:51:58+05:30 IST

స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఈద్గా యూత్‌ సభ్యులకు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందజేశారు.

పీపీఈ కిట్లు, శానిటైజర్ల పంపిణీ

గూడూరురూరల్‌, మే 10: స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఈద్గా యూత్‌ సభ్యులకు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈద్గా యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేర్నాటి చారిటుబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి ఈద్గాయూత్‌ సభ్యులకు 100 పీపీఈ కిట్లు అందజేసినట్లు సంస్థ సభ్యులు తెలిపారు.

Updated Date - 2021-05-11T03:51:58+05:30 IST