ఫైనల్లో ప్రజ్ఞనంద
ABN , First Publish Date - 2022-05-26T10:43:21+05:30 IST
చెస్ యువ కెరటం ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. తనకంటే ఎంతో అనుభవం ఉన్న డచ్ గ్రాండ్ మాస్టర్ అనీష్ గిరీని ఓడించి..
సెమీ్సలో అనీష్కు షాక్
చెన్నై: చెస్ యువ కెరటం ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. తనకంటే ఎంతో అనుభవం ఉన్న డచ్ గ్రాండ్ మాస్టర్ అనీష్ గిరీని ఓడించి.. చెసబుల్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఈ టోర్నీ తుది పోరుకు చేరిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. బుధవారం జరిగిన ఆన్లైన్ సెమీఫైనల్స్లో ప్రజ్ఞానంద 3.5-2.5తో అనీ్షపై ఉత్కంఠ విజయం సాధించాడు. టైటిల్ ఫైట్లో వరల్డ్ నెం:2 డింగ్ లిరెన్ (చైనా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో సెమీ్సలో కార్ల్సన్ను లిరెన్ ఓడించాడు.
నిద్రపోకుండా : మ్యాచ్ ముగిసేసరికి అర్ధరాత్రి దాటింది. దీంతో స్కూల్లో నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తానని ప్రజ్ఞానంద ట్వీట్ చేశాడు. ‘ఉదయం 8.45కు స్కూల్లో ఉండాలి. ఇప్పుడు 2 గంటలైంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ సమయంలో నిద్రపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని రాశాడు.