Nizamabadలో ప్రజా గోస -బీజేపీ భరోసా బైక్ యాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-21T17:54:44+05:30 IST
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ప్రజా గోస -బీజేపీ భరోసా బైక్ యాత్ర గురువారం ప్రారంభైంది.
నిజామాబాద్: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh) ఆధ్వర్యంలో ప్రజా గోస -బీజేపీ భరోసా బైక్ యాత్ర గురువారం ప్రారంభైంది. బోధన్ మండలం నర్సాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాజాసింగ్ బైక్ యాత్రను మొదలు పెట్టారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించేందుకు ప్రజా గోస బీజేపీ భరోసా పేరుతో కమలం పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది.