సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదివస్
ABN , First Publish Date - 2022-05-24T05:58:45+05:30 IST
సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదివస్ను నిర్వహిస్తున్నామని ఎస్పీ రాహుల్హెగ్డే అన్నారు.
- ఎస్పీ రాహుల్ హెగ్డే
సిరిసిల్ల క్రైం, మే 23: సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదివస్ను నిర్వహిస్తున్నామని ఎస్పీ రాహుల్హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్లో 16ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా భూమిని నమోదుచేయమని పౌరవివాదాలకు పాల్పడితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఏ అధికారి అయినా సివిల్ తగాదాల్లో తలదూరిచనట్లయితే చర్యలు తప్పవన్నారు. బాధితులకు న్యాయం చేయడానికే ప్రజాదివస్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాదివస్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవా లని, ఫిర్యాదుదారులతో సంబంధిత ఎస్హెచ్ఓలు నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.