ఉచిత మెడికల్ క్లినిక్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-07-26T05:55:39+05:30 IST
ప్రజారోగ్యవేదిక, గుఱ్ఱం జాషువా విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని పీఎల్ రావు భవన్లో ఏర్పాటు చేసిన ఉచిత శాశ్వత మెడికల్ క్లినిక్ను ఆదివారం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు.
గుంటూరు (తూర్పు), జూలె 25: ప్రజారోగ్యవేదిక, గుఱ్ఱం జాషువా విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని పీఎల్ రావు భవన్లో ఏర్పాటు చేసిన ఉచిత శాశ్వత మెడికల్ క్లినిక్ను ఆదివారం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్లినిక్ను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. క్లినిక్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నేత పాశం రామారావు, ప్రముఖ వైద్యులు మధుసూదనరావు, రమణ యశస్వి, సాయిప్రసాద్, గొంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.