ప్రకాశం జిల్లాలో విరిగిన రైలు పట్టాలు
ABN , First Publish Date - 2021-11-03T14:14:28+05:30 IST
గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు స్టువర్టుపురం - ఈపురుపాలెం మధ్య రైలు పట్టాలు విరిగాయి.
ఒంగోలు: గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు స్టువర్టుపురం - ఈపురుపాలెం మధ్య రైలు పట్టాలు విరిగాయి. వెంటనే అప్రత్తమైన రైల్వే గస్తీ సిబ్బంది సికింద్రాబాద్ - చెన్నై చార్మినార్ ఎక్స్ప్రెస్ను స్టువర్టుపురం స్టేషన్లోనే నిలిపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రాత్రి 1:30 నుండి 3:40 వరకు రైల్వే సిబ్బంది శ్రమించి మరమ్మతులు చేశారు. రైలు పట్టాల రిపేర్లు పూర్తి చేసిన అనంతరం రైళ్ల రాకపోకలు కొనసాగాయి.