Prakasam: పడవ నుంచి సముద్రంలో పడి మత్స్యకారుడు మృతి
ABN , First Publish Date - 2021-11-27T19:06:12+05:30 IST
ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో విషాదం చోటు చేసుకుంది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో విషాదం చోటు చేసుకుంది. సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లిన పెద్ద సింగ్ కోటేశ్వరరావు(55) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు కాలు జారి పడవ నుండి సముద్రంలో పడి మృతి చెందాడు. వలలో చిక్కుకున్న మత్యకారుడి మృతదేహాన్ని తోటి జాలర్లు బయటకు తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.