మంత్రి సురేష్ కాన్వాయ్లో వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-12-09T16:25:48+05:30 IST
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గోబ్బురు వద్ద విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్లో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు
ఒంగోలు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గోబ్బురు వద్ద విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్లో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరు స్వెటర్స్ అమ్ముకునేందుకు బైక్పై వెళ్తుండగా మంత్రి సురేష్ కాన్వాయ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బాడిగ మహేష్, క్షతగాత్రురాలు ఆయన భార్య మహేశ్వరిగా గుర్తించారు. ఎర్రగొండపాలెం నుండి మార్కాపురం వెళ్తున్న కాన్వాయ్ వాహనం గొబ్బురు వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. భార్యాభర్తలు చిరువ్యాపారులు. తీవ్రంగా గాయపడిన మహేశ్వరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.