Ongole: వైసీపీ నేతపై అట్రాసిటీ కేసు నమోదు
ABN , First Publish Date - 2022-03-17T16:41:52+05:30 IST
ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. గతంలో కార్పోరేషన్ సిబ్బంది తొలగించిన పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం నిన్న మేయర్ గంగాడ సుజాతను సుబ్బారావు గుప్తా కలిశారు. అయితే సుబ్బారావు గుప్తా తనను దూషించాడని పోలీసులకు మేయర్ ఫిర్యాదు చేశారు. మేయర్ ఫిర్యాదుతో సుబ్బారావుపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.