ప్రారంభం కాకుండానే శిథిలం

ABN , First Publish Date - 2021-06-23T06:51:09+05:30 IST

లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆశ్రమ పాఠశాల అదనపు గదుల సముదాయం ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరింది.

ప్రారంభం కాకుండానే శిథిలం

నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి రాని

ఆశ్రమ పాఠశాల సముదాయం

ఏడేళ్ల నుంచి ఇదే తంతు

రూ.కోటి  నిధులు వృథా

పెద్దదోర్నాల, జూన్‌ 22 : లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆశ్రమ పాఠశాల అదనపు గదుల సముదాయం ప్రారంభించకుండానే శిథిలావస్థకు చేరింది. మండలంలోని చింతల గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతోంది. ఇక్కడ చదివేగిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం అదనపు గదుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. ఆ వెంటనే అధికారులు 2014 జనవరి 31న నాబార్డు నిధులు 95 లక్షల రూపాయల అంచనాతో టెండర్‌ ఖరారు చేశారు. 2015 జనవరి 30 నాటికి నిర్మాణం పూర్తి చేశారు. నేటికీ ఆ సముదాయాన్ని ప్రారంభింఛలేదు. దీంతో కిటికీలు, తలుపులు ఊడిపోయాయి. అపుడు వేసిన తాళం ఇప్పటికీ తీయలేదు. సుమారు కోటి రూపాయలు వృథా అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ పాఠశాల అదనపు గదుల సముదాయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించాం

నిర్మించిన అదనపు గదుల సముదాయం నేటికీ వినియోగంలోకి తీసుకురావడంలో వైఫల్యంపై ఐటీడీఏ డీఈ లతను వివరణ కోరగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించినట్లు ఆమె తెలిపారు. 


Updated Date - 2021-06-23T06:51:09+05:30 IST