తిరుమలేశుడి సేవలో ప్రణీత
ABN , First Publish Date - 2021-06-18T06:23:33+05:30 IST
‘అత్తారింటికి దారేది’ చిత్రంతో గుర్తింపు పొందిన హీరోయిన్ ప్రణీత గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో గుర్తింపు పొందిన హీరోయిన్ ప్రణీత గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే ‘నాంది’ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు.