సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ

ABN , First Publish Date - 2022-04-16T18:27:35+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్నికల ప్రచార

సోనియా గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం భేటీ అయ్యారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ సమావేశంలో ఆ పార్టీ ఉన్నత స్థాయి నేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. 


ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై వీరంతా చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురైన పరాజయాలపై కూడా చర్చించారని సమాచారం. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది.


ప్రశాంత్ కిశోర్ మార్చిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిసిన సంగతి తెలిసిందే. అయితే వీరి సమావేశాల గురించి అధికారికంగా ప్రకటించలేదు. తాజా సమావేశం నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం మరోసారి ఊపందుకుంది. 


Updated Date - 2022-04-16T18:27:35+05:30 IST