పీకే బయటకు వచ్చేసినా.. ఆయన బృందం మాత్రం మమతతోనే!
ABN , First Publish Date - 2021-06-15T21:24:56+05:30 IST
ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ ‘స్పేస్’
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ ‘స్పేస్’ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆయన తమిళనాడులో డీఎంకేకు, పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి పనిచేశారు. ఈ రెండింటినీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా ఏ పార్టీకి తాను పనిచేయబోనన్న పీకే ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది.
ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నప్పటికీ ఆయన సారథ్యంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్)తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ను తృణమూల్ కాంగ్రెస్ 2026 వరకు పొడిగించింది. అయితే, పీకే లేకుండా ఐ-ప్యాక్లోని 9 మంది బృందం ఎలా నెగ్గుకొస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐ-ప్యాక్ పశ్చిమ బెంగాల్లో జరగనున్న పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ కోసం పనిచేస్తుంది.