IPAC: త్రిపుర అధికారులు మమ్మల్ని నిర్బంధించారు
ABN , First Publish Date - 2021-07-27T01:24:04+05:30 IST
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఐ-పాక్ సంస్థ త్రిపుర సర్కార్పై ఆరోపణలు చేశారు. త్రిపుర అధికారులు తమ బృంద
త్రిపుర :ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఐ-పాక్ సంస్థ ప్రతినిధులు త్రిపుర సర్కార్పై ఆరోపణలు చేశారు. త్రిపుర అధికారులు తమ బృంద సభ్యుల్ని ఓ హోటల్లో బంధించారని ఆరోపించారు. హోటల్ నుంచి బయటికి రావడానికి ప్రభుత్వ అధికారులు నిరాకరించారని ఐపాక్ సభ్యులు ఆరోపించారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్కు త్రిపురలో రాజకీయపరంగా ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి తాము త్రిపుర వెళ్లామని తెలిపారు. తమ టీమ్కు చెందిన 22 మంది సభ్యులు త్రిపురకు వెళ్లారని ఐపాక్ పేర్కొంది.