ధాన్యాన్ని ఇండియా గేట్ ముందు పారాబోస్తాం: ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-25T00:03:14+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వం కొనే వడ్లను ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు పారాబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ధాన్యాన్ని ఇండియా గేట్ ముందు పారాబోస్తాం: ప్రశాంత్‌రెడ్డి

ఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం కొనే వడ్లను ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు పారాబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల తరపున కేంద్రం వైఖరిని ఖండించారు.60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి వచ్చే ధాన్యాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుటుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-12-25T00:03:14+05:30 IST