Praveen Nettaru murder case: బీజేపీ యువత ప్రవీణ్ హత్యకేసు.. రంగంలోకి ఎన్ఐఏ
ABN , First Publish Date - 2022-08-07T02:48:11+05:30 IST
దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బెళ్లారె గ్రామానికి చెందిన బీజేపీ యువనాయకుడు ప్రవీణ్ నెట్టారు (Praveen Nettaru
బెంగళూరు: దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా బెళ్లారె గ్రామానికి చెందిన బీజేపీ యువనాయకుడు ప్రవీణ్ నెట్టారు (Praveen Nettaru) హత్యకేసును దర్యాప్తు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ జాతీయ దర్యాప్తు సంస్థను (NIA) ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవీణ్ హత్యకేసును ఎన్ఐఏ ద్వారా దర్యాప్తు చేయించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని కోరింది. దీంతో కేంద్రప్రభుత్వ అదనపు కార్యదర్శి విపుల్ అలోక్ ఎన్ఐఏ డైరెక్టర్ ఆఫ్ జనరల్కు లేఖ రాశారు. ఆ లేఖను కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి పంపారు.
జులై 26న బెళ్లారెలోని మాస్తి కట్టె వద్ద అక్షయ ఫ్రెష్ చికెన్ దుకాణం నిర్వహించే ప్రవీణ్ను కొందరు వ్యక్తులు కాపుకాసి దారుణంగా హతమార్చారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. కేరళ, బెంగళూరులలో తలదాచుకున్నవారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఎన్ఐఏ రంగంలోకి దిగడంతో భిన్న కోణాలలో విచారణ జరిపే అవకాశం ఉంది.