పీఆర్సీ, పదోన్నతులు అమలుచేయాలి

ABN , First Publish Date - 2021-02-27T05:31:36+05:30 IST

ఎన్నికల కమిషన్‌ అనుమతితో పీఆర్సీ, పదోన్నతులు అమలుచేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.నాగమల్లేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

పీఆర్సీ, పదోన్నతులు అమలుచేయాలి

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు

తల్లాడ, ఫిబ్రవరి 26: ఎన్నికల కమిషన్‌ అనుమతితో పీఆర్సీ, పదోన్నతులు అమలుచేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.నాగమల్లేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తల్లాడ మండలంలోని ఉన్నత పాఠశాలల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా, ఉపాధ్యాయరంగ సమస్యల విషయంలో దాటవేతధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె.శ్రీకాంత్‌, మండల అధ్యక్షుడు ఐ.నర్సింహారావు, ఫర్మా, పాపయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-02-27T05:31:36+05:30 IST