పీఆర్సీ నివేదిక విడుదల చేయాలి : డీటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-11-25T06:40:38+05:30 IST

పీఆర్సీ నివేదిక విడుదల చేయాలి : డీటీఎఫ్‌

పీఆర్సీ నివేదిక విడుదల చేయాలి : డీటీఎఫ్‌
ఉపాధ్యాయుల నుంచి సభ్యత్వాన్ని స్వీకరిస్తున్న డీటీఎఫ్‌ నేతలు

 హనుమాన్‌జంక్షన్‌, నవంబరు 24 : ఉపాధ్యాయుల పీఆర్సీ నివేదికను వెంట నే విడుదల చేసి 55 శాతం ఫిట్‌మెంట్‌తో 2018 జూలై నుంచి  అమలు చేయాలని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి  రావెళ్ల వరుణ్‌ కుమార్‌  ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్‌ నిధి వసూళ్లతో పాటు సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌ బాపులపాడు మండలంలో  బుధవారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీపీఎ్‌సను  రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు పని ఒత్తిడిని పెంచే  అన్ని యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డీవైఈవో  పోస్టును మంజూరు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం  డీటీఎఫ్‌ చేసే పోరాటాలకు ఉపాధ్యాయులంతా సహకరించాల న్నారు. క్యాంపెయిన్‌లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె. రాజేంద్రప్రసాద్‌, ఉపాధ్యక్షుడు యు. రాము, జిల్లా కార్యదర్శి వి.రాంబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి. భానుమతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-25T06:40:38+05:30 IST