సైక్లింగ్లో ప్రీతి రికార్డు
ABN , First Publish Date - 2022-06-27T10:02:40+05:30 IST
పుణెకు చెందిన ప్రీతి మస్కే అలా్ట్ర సైక్లింగ్ ప్రపంచ రికార్డు సృష్టించింది.
న్యూఢిల్లీ: పుణెకు చెందిన ప్రీతి మస్కే అలా్ట్ర సైక్లింగ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. లేహ్ నుంచి మనాలి వరకు ఉన్న 430 కిలో మీటర్ల దూరాన్ని 45 ఏళ్ల ప్రీతి సైకిల్ తొక్కుకుంటూ 55 గంటల 13 నిమిషాల్లో చేరుకొంది. ఈ సాహసోపేతమైన ఫీట్ సాధించిన తొలి మహిళగానూ ప్రీతి నిలిచింది. ఆమె ఫీట్కు గిన్నిస్ బుక్లోకి ఎక్కగల అర్హత ఉందని అధికారులు తెలిపారు. 6 వేల కిలోమీటర్ల గోల్డెన్ క్వాడ్రిలేటరల్ను చుట్టేసిన వేగవంతమైన మహిళా సైక్లిస్ట్గా కూడా ప్రీతి రికార్డు నెలకొల్పింది.